TS Elections : తెలంగాణలో మొత్తం ఎంత మంది ఓటు వేశారో తెలుసా..?

by Rajesh |
TS Elections : తెలంగాణలో మొత్తం ఎంత మంది ఓటు వేశారో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో 71.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3,26,01,793 మంది ఓటర్లు ఉండగా.. గురువారం పోలింగ్ లో 2,32,59,256 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 1,15,84,728 మది పురుషులు ఉండగా.. 1,16,73,722 మంది మహిళలు ఉన్నారు. 806 మంది ఇతరులు ఉన్నారు. నియోజక వర్గాల వారీగా మునుగోడు 91.89 పోలింగ్ శాతంతో టాప్ లో నిలిచింది. అత్యల్పంగా యాకుత్ పురాలో 39.64 శాతం పోలింగ్ నమోదైంది.



Next Story

Most Viewed