TS Elections : పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ స్టార్ట్

by Sathputhe Rajesh |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి.

TS Elections : పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు (గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీంతో అధికారులు పోలింగ్ కు ఏర్పాట్లను వేగంగా చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. సిబ్బందికి ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అధికారులు అందించనున్నారు. సాయంత్రంలోపు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్లను నియమించారు.

Next Story