Breaking: తెలంగాణలో 47 మంది డీఎస్పీల బదిలీ

by Disha Web Desk 16 |
Breaking: తెలంగాణలో 47 మంది డీఎస్పీల బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్యంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలు శాఖలో ప్రభుత్వం బదిలీలను చేపడుతోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో పని చేసే అధికారులను బదిలీ చేశారు. తాజాగా తెలంగాణలో 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. అయితే మరోమారు వారిని మార్చింది. ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని పోలీస్ శాఖ ఈ బదిలీలను చేపట్టింది. ఒకే పార్లమెంట్ పరిధిలో నాలుగేళ్లు పని చేసిన డీఎస్పీలను తాజాగా పోలీస్ శాఖ బదిలీ చేసింది.

అయితే 22 రోజుల్లో డీఎస్పీలను అయిదోసారి బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 12వ తేదీ నుంచి మొదలైన ఈ ట్రాన్స్‌ఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ౪౭ మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో ఇటీవలే ట్రాన్స్ ఫర్ అయిన అధికారులు కూడా ఉండటం గమనార్హం.



Next Story

Most Viewed