TG Govt: తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ

by Gantepaka Srikanth |   (  Updated:2024-11-11 16:28:17  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌(IAS)లను బదిలీ చేసింది.

TG Govt: తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌(IAS)లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. టూరిజం కల్చరల్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీధర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా అనితా రామచంద్రన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి, ట్రాన్స్‌కో సీఎండీగా కృష్ణ భాస్కర్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా సురేంద్ర మోహన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్‌గా శ్రీజన, ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి, ఆరోగ్యశ్రీ సీఈవోగా శివశంకర్, ఇంటర్మీడియట్ డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, లేబర్ కమిషనర్‌గా సంజయ్ కుమార్, జీఏడీ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్‌లను బదిలీ చేశారు.

Next Story