తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీగా క్షేత్రస్థాయిలో ఇంజినీర్ల బదిలీ

by Prasad Jukanti |   (  Updated:2025-10-14 11:00:53  IST  )

ఎన్‌వోసీల జారీ విషయంలో ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం ఇంజినీర్లపై చర్యలు తీసుకుది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..  భారీగా క్షేత్రస్థాయిలో ఇంజినీర్ల బదిలీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదలశాఖలో భారీగా క్షేత్రస్థాయిలో ఇంజినీర్లను బదిలీ (engineer transfers) చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 106 మంది ఇంజినీర్లను బదిలీ చేయగా ఇందులో హైదరాబాద్‌ సర్కిల్ పరిధిలో 60 మందికి పైగా ఇంజినీర్లు బదిలీ అయ్యారు. చెరువులు, కుంటల్లో నిర్మాణ సంస్థలకు ఇళ్ల నిర్మాణాలకు అనుమతలు కోసం ఎన్‌వోసీల జారీ విషయంలో వస్తున్న ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్‍వోసీ విషయంలో ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బదిలీ అయిన ఇంజినీర్లలో ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు ఉన్నారు.

Read More: ఈ నెల 16న తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల పిటిషన్.. భేటీపై ప్రాధాన్యత

Next Story