ఎక్సైజ్‌ అకాడమీలో ఏఈఎస్‌, ఎస్సైలకు శిక్షణ ప్రారంభం.. గ్రూప్ 1,2 ద్వారా ఎంపికైన 115 మంది అభ్యర్థులు

by Ramesh Naini |   (  Updated:2025-11-01 14:22:41  IST  )

గ్రూపు 1,2 ద్వారా ఎంపికైన 115 మంది అభ్యర్థులకు శనివారం ఎక్సైజ్‌ అకాడమీలో శిక్షణ ప్రారంభించారు.

ఎక్సైజ్‌ అకాడమీలో ఏఈఎస్‌, ఎస్సైలకు శిక్షణ ప్రారంభం.. గ్రూప్ 1,2 ద్వారా ఎంపికైన 115 మంది అభ్యర్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూపు 1,2 ద్వారా ఎంపికైన 115 మంది అభ్యర్థులకు శనివారం ఎక్సైజ్‌ అకాడమీ (Excise Academy)లో శిక్షణ ప్రారంభించారు. ఈ మేరకు ఆకాడమీ డైరెక్టర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, జాయింట్‌ డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డిలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 నుంచి 31 మంది ఎక్సైజ్‌ ఏఈఎస్‌ (అసిస్టెంట్‌ సూపరిడెంట్‌) అభ్యర్థులుగా, గ్రూపు 2 ద్వారా ఎక్సైజ్‌ ఎస్సైలుగా 84 మంది అభ్యర్థుల ఎంపికైనట్లు వెల్లడించారు. వరంగల్‌ జోన్‌, హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఆరు నెలల పాటు ఎక్సైజ్‌ అకాడమీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణలో గ్రూపు 1 ద్వారా ఏఈఎస్‌లుగా చేరిన 31మందిలో 8మంది మహిళలు, 23 మంది పురుషులు ఉన్నట్టు పేర్కొన్నారు. గ్రూప్ 2 ద్వారా ఎస్సైలుగా చేరిన వారిలో 24 మంది మహిళలు, 60 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు.

Next Story