సీఎం రేవంత్‌ను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-04 15:37:56  IST  )

సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కేడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్‌ను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కేడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన వారిలో Dr.MCRHRDలో శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌లు సౌరభ్ శర్మ, సలోని ఛబ్రా, హర్ష చౌదరి, కరోలిన్ చింగ్తియన్మయి, కొయ్యడ ప్రణయ్ కుమార్ ఉన్నారు. Dr.MCRHRD వైస్ ఛైర్మపర్సన్ శాంతి కుమారి మరియు కోర్సు డైరెక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో ట్రైనీ ఐఏఎస్‌లు సీఎంను కలిశారు. వారిని అభినందించిన సీఎం బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. కాసేపు వారితో కూర్చుని సరదాగా మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, Dr. MCRHRD వైస్-ఛైర్‌పర్సన్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story