Cows : అక్రమంగా తరలిస్తున్న 269ఆవుల పట్టివేత

by Y. Venkata Narasimha Reddy |

Cows : అక్రమంగా తరలిస్తున్న 269ఆవుల పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ : గోవుల(cows) ఆక్రమ రవాణ(smuggled)పై పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికి నిత్యం ఎక్కడో ఒక చోట తనిఖీల్లో లేక స్వచ్చంద సంస్థల సమాచారంతో వాటి అక్రమ రవాణా ఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మాడుగులపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 269ఆవులను పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. మిర్యాలగూడ రూరల్ పరిధిలో ఒక డీసీఎంలో 55 ఆవులు, మడుగులపల్లిలో రెండు డీసీఎంలో 104 ఆవులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిర్యాలగూడ వన్ టౌన్ పీఎస్ పరిధిలో రెండు డీసీఎంలలో 110 ఆవులను గుర్తించినట్లు వెల్లడించారు. ఆవులను వాహనాల్లో కుక్కి వాటిని కబేళాలకు అక్రమ రవాణా చేస్తున్నారని, పట్టుబడిన ఆవులను గోశాలకు తరలించినట్లు తెలిపారు.

Next Story