రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్​ ప్రదర్శనలు

by Dishafeatures2 |
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్​ ప్రదర్శనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఆందోళనలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజు రీయంబర్స్ మెంట్,ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి,పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి,పోడు భూములకు పట్టాలు, రైతు రుణ మాఫీ, ముస్లీం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లపై ఆందోళనలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

అంతేగాక ఈ నెల 22న అన్ని నియోజక వర్గ కేంద్రాలలో దశాబ్ది దగా పేరుతో కేసీఆర్ దిష్టి బొమ్మ ను రావణ సురుడిలాగా తయారు చేసి దగ్దం చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రజా సమస్యలపై ఆర్​డీవో, ఎంఆర్​వోకు వినతి పత్రాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్ని జిల్లాల డీసీసీలకు మహేష్​ కుమార్​గౌడ్​ ఆదేశాలిచ్చారు.

Next Story

Most Viewed