టీ కాంగ్రెస్ లో పదవుల పండగ.. 14 డీసీసీ కమిటీలను ప్రకటించిన టీపీసీసీ చీఫ్

by Prasad Jukanti |   (  Updated:2026-03-19 12:44:12  IST  )

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 14 జిల్లాలకు పూర్తిస్థాయి డీసీసీ కమిటీలను ప్రకటించారు.

టీ కాంగ్రెస్ లో పదవుల పండగ..  14 డీసీసీ కమిటీలను ప్రకటించిన టీపీసీసీ చీఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి సారించిన అధికార కాంగ్రెస్ పార్టీ (Congress) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 33 జిల్లాలకు డీసీసీలను నియమించగా తాజాగా 14 డీసీసీ కమిటీలను (District Congress Committees) ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీసీసీ కమిటీలను ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి పదవులతో పాటు పూర్తి స్థాయి కమిటీల నియామించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం వెలువరించారు. నాగర్న కర్నూల్, పెద్దపల్లి, మెదక్, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్, వనపర్తి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి కలిగి మొత్తం 14 జిల్లాల టీసీసీ కమిటీలను ప్రకటించారు.

Next Story