కొడంగ‌ల్ బ‌రిలో రేవంత్ రెడ్డి.. టిక్కెట్‌కు దరఖాస్తు

by Disha Web Desk 13 |
TPCC President Revanth Reddy Alleged CM KCR of Destroying The Education System In The State
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొడంగల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. టిక్కెట్ కేటాయించాలని ఆయన పార్టీ హై కమాండ్‌కు రిక్వెస్టు చేశారు. ఈ మేరకు దరఖాస్తును కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తలు గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​గౌడ్‌కు అందజేశారు.


దీంతో పాటు మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య తరఫున జనగామ నియోజక వర్గం దరఖాస్తు ను ఆయన అనుచరులు పార్టీ కి అందజేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు గాంధీభవన్‌కు దాదాపు ఆరు వందల అప్లికేషన్లు చేరినట్లు తెలిసింది.


Next Story