'ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు 7 మార్కులు కలపాల్సిందే'

by Disha Web Desk 2 |
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు 7 మార్కులు కలపాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరాశే మిగిల్చారని లేఖలో సర్కార్‌ను విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నాపత్రంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయమే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి విన్నవించుకున్నా ప్రభుత్వం వద్దనుంచి సమాధానం రాలేదని గుర్తుచేశారు. ప్రిలిమ్స్‌లో తప్పుగా వచ్చిన ఏడు ప్రశ్నలను తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తప్పుడు ప్రశ్నల వల్ల దేహదారుడ్య పరీక్షలకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు ఆ ఏడు మార్కులు కలిపి మళ్లీ అవకాశం కల్పించాలని కోరారు.

ఈ నెల 22 నుంచి దేహ దారుడ్య పరీక్షలు.. సీపీ శ్వేత

Next Story

Most Viewed