కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు‌ను ఎవరూ ఆపలేరు: రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు‌ను ఎవరూ ఆపలేరు: రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రం హవేలీ నియోజకవర్గం ఇంఛార్జిగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతలు చాలా మంది కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలోనూ ప్రచారం నిర్వహిస్తారని రేవంత్ స్పష్టం చేశారు. ఈ నెల 8న హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరని, బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర యువకుడికి మాత్రం ఉద్యోగం ఇచ్చారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read..

ప్రియాంక గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న భట్టి


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed