మనిషి కనిపడట్లేడు.. మాట వినపడట్లేదు.. KTR ఇప్పుడెక్కడ..? రేవంత్ రెడ్డి సెటైర్

by Disha Web Desk 19 |
మనిషి కనిపడట్లేడు.. మాట వినపడట్లేదు.. KTR ఇప్పుడెక్కడ..? రేవంత్ రెడ్డి సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరంలో వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. రోడ్లపైకి మోకలాల్లోతు నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇవాళ మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. ‘నువ్వు నిర్మించిన విశ్వనగరం జల విలయంలో విలవిలలాడుతోంది. పండుటాకులా వణికిపోతోంది. హైటెక్ హంగుల వీడియోలు, ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో భ్రమలు కల్పించే కేటీఆర్.. ఇప్పుడెక్కడ? మనిషి కనిపించడం లేదు.. మాట వినిపించడం లేదే’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed