సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు KCR రాగలరా..? Revanth Reddy

by Disha Web Desk 19 |
సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు KCR రాగలరా..? Revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేను ప్రజల మనిషిని నాకు సెక్యూరిటీతో పనిలేదు.. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తాను అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గింపు విషయంపై మీడియాతో ఇవాళ చిట్‌చాట్‌లో మాట్లాడారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎంపీగా ఉన్న, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు సెక్యూరిటీ తొలగిస్తారా? అని నిలదీశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చామని గుర్తుచేశారు. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా..? అని ప్రశ్నించారు. తనను ఓడించడానికి పోలీసులను సీఎం కేసీఆర్ వాడుకున్నారని, సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేవాడిని కాదన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన సైన్యమని, తన సెక్యూరిటీ వాళ్ళే అని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారని ఆరోపించారు. ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్‌లో రాస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టమని మండిపడ్డారు.

ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే తాను అనేదని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్‌గా ఎలా ఉంటామని అన్నారు. అధికారులకు రాజకీయాలతో ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. కాగా, పొత్తుల గూర్చి ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఏఐసీసీ చూసుకుంటుందని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed