ఆ ఫేక్ లెటర్ బీఆర్ఎస్ పనే.. క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Satheesh |

రైతు బంధుపై కేంద్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో తాను రాసినట్టు ఫేక్ లెటర్ సృష్టించి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని

ఆ ఫేక్ లెటర్ బీఆర్ఎస్ పనే.. క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు బంధుపై కేంద్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో తాను రాసినట్టు ఫేక్ లెటర్ సృష్టించి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా రైతుబంధు ఎలక్షన్ కమిషన్ నిలిపివేతకు తానే కారణమని నెట్టింట్లో చక్కర్లు కోడుతున్న లెటర్‌పై వివరణ ఇచ్చారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ దిగజారి ఇలాంటి ఫేక్ ప్రచారాలకు పాల్పడుతోందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజు, రాష్ట్ర డీజీపీని కోరుతున్నాని పేర్కొన్నారు.

Next Story