ఆ వీడియో చూస్తే గుండెలు బరువెక్కుతాయి: రేవంత్ ఎమోషనల్ ట్వీట్

by Disha Web Desk 19 |
TPCC Chief Revanth Reddy Slams CM KCR and PM Modi Over Floods assistance
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అణిచివేసేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ మిత్రుడు అదానీ అరాచకాలపై ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రస్తావించడంతోనే ఆయనపై కక్ష్య పూరిత చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే మొదట ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసి, ఆ తర్వాత ఢిల్లీలోని అధికార భవనం నుంచి రాహుల్‌ను ఖాళీ చేపించారని మండిపడ్డారు. రాహుల్‌పై జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

"గొప్ప కుటుంబ వారసత్వ చరిత్ర ఉండి, దేశానికి తమ వారసత్వ ఆస్తులను ధారబోసిన కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి, పార్లమెంటుకి అనర్హుడిగా చేసింది. అధికార నివాసమైన ఇల్లును ఖాళీ చేయించి కట్టుబట్టలతో బయటకు పంపించింది. ఆ సమయంలో చాలా హుందాగా, యువతకు ఆదర్శవంతంగా ప్రవర్తించి, ఇంటిని ఖాళీచేసి ప్రభుత్వానికి అప్పజెప్పి బయటకు వెళ్లిన తీరు భారతీయ ఆత్మకు రాహుల్ మరింత చేరువయ్యాడు. ఆ దృశ్యాలను చూసినవాళ్లకు కళ్ళల్లో నీటిసుడులు తిరుగుతాయి, గుండెలు బరువెక్కుతాయి." అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed