ప్రభుత్వం పట్టించుకోదు.. మనల్ని మనమే కాపాడుకోవాలి

by Disha Web Desk 2 |
ప్రభుత్వం పట్టించుకోదు.. మనల్ని మనమే కాపాడుకోవాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​మహానగరంలో మ్యాన్ హోళ్లు, వీధి కుక్కలు పిల్లల ప్రాణాలు మింగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు. ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందన్నారు. కళాసిగూడలో మౌనిక మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. రాజమహళ్లు రాచరిక పోకడలకు వెళ్తున్న కేసీఆర్‌కు సామాన్యుల గోస కనిపించదన్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం వస్తుందని, అప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుందన్నారు. దీంతో గ్రేటర్ ప్రజలంతా ఎవరికి వారే ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ ట్విట్టర్​వేదికగా సూచించారు.

Next Story

Most Viewed