గద్దరన్నా.. నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Dishafeatures2 |
గద్దరన్నా.. నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాయుద్ధ నౌక గద్దర్ మృతి పట్ల పలువరు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘గద్దరన్నా… నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం. నీ మరణం… నా గుండెకు శాశ్వత గాయం’’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. కాగా గద్దర్ మృతిపట్ల సీఎం కేసీఆర్ , ఏపీ సీఎం జగన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ సహా పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇక గద్దర్ అంతిమయాత్రలో సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.



Next Story

Most Viewed