- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. స్పెషల్ గెస్టుగా జపాన్బృందం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్గ్రాండ్గా వేడుకలు జరుపనుంది. ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందన స్వీకరిస్తారు. పరేడ్గ్రౌండ్లో నిర్వహించే వేడుకులకు స్పెషల్గెస్టులు విచ్చేస్తున్నారు. జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్కజుహిసాటకేజీ ప్రతినిధి బృందం వేడులకు హాజరుకానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేశారు. జూన్2 రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుంది.
రాజీవ్యువ వికాసం, గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలు సైతం శ్రీకారం చుట్టునుంది. ఇందులో 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నది.






