- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు సోమవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయినవారి సంఖ్య 24కి చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బోర్డు ఉద్యోగి ప్రవీణ్ కుమార్ బ్యాంక్ అకౌంట్లను సిట్ అధికారులు విశ్లేశించినపుడు కొన్ని అనుమానాస్పద లావాదేవీలు దృష్టికి వచ్చాయి. ఈ దిశలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులు తాజాగా మురళీధర్ రెడ్డి, మనోజ్తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా ప్రవీణ్ కుమార్ ఒక్కొక్కరి నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష ప్రశ్నపత్రాలు అమ్మినట్టుగా వెళ్లడయ్యింది. వీరితోపాటు మరో ముగ్గురికి కూడా ప్రవీణ్ కుమార్ ప్రశ్నపత్రాలు అమ్మినట్టు దర్యాప్తులో తేలింది. వీరి కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు.
Next Story