టీజీపీఎస్సీ‌లోకి మరో ముగ్గురు కొత్త సభ్యులు

by Gantepaka Srikanth |

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)లో మరో ముగ్గురు కొత్త సభ్యులు నియామకం అయ్యారు.

టీజీపీఎస్సీ‌లోకి మరో ముగ్గురు కొత్త సభ్యులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)లో మరో ముగ్గురు కొత్త సభ్యులు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సి.చంద్రకాంత్ రెడ్డి, విశ్వ ప్రసాద్, ప్రొ.ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్‌లు నియామకం అయ్యారు. ఈ ముగ్గురు సభ్యులు ఆరు సంవత్సరాల పాటు లేదా వారికి 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు, ఏది ముందు అయితే అప్పటివరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నియామకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం జరిగినట్లు తెలిపారు.

Next Story