కేటీఆర్ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు డుమ్మా

by Disha Web Desk 2 |
కేటీఆర్ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు డుమ్మా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో జరిగిన కేటీఆర్ మీటింగ్‌కు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డిలు కేటీఆర్ మీటింగ్‌కు హాజరు కాలేదు. ఈ ముగ్గురు కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించిన సమావేశానికి వీరు దూరంగా ఉండటంతో పొలిటికల్ సర్కిల్‌లో రకరకాల ఉహాగానాలు మొదలయ్యాయి. అయితే కార్యకర్తలతో బిజీగా ఉండటం వల్లే ఈ మీటింగ్‌కు హాజరు కాలేదని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేటీఆర్ సమావేశం ముగియగానే పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కేటీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలవబోతున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed