- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్గొండలో తీవ్ర విషాదం.. పండగ పూట డిండి వాగులో దిగి ముగ్గురు మృతి
by Prasad Jukanti |
పండగ కోసం బంధువుల ఇంటికి వచ్చిన ముగ్గురు విగతాజీవులుగా మారారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దసరా (Dasara) పండగ పూట నల్గొండ (Nalgonda district) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చందంపేట మండలం దేవరచర్ల డిండి (Dindi) వాగులోకి దిగి ముగ్గురు మృతి చెందారు. తొలుతో వాగులోకి దిగిన సాయి ఉమాకాంత్ (10) అనే బాలుడు గల్లంతయ్యాడు. వాగులో పడిన బాలుడిని కాపాడేందుకు రాము(30), గోపి(21) సైతం వాగులోకి దిగి గల్లంతయ్యారు. ముగ్గురు గల్లంతు కావడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ముగ్గురు మృతులు పండగ కోసం తెనాలి నుంచి బంధువుల ఇంటికి వచ్చారు. పండగపూట తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story






