Ashwini Vaishnav: తెలంగాణలో మూడు బ్యాటరీ తయారీ క్లస్టర్లు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

by Prasad Jukanti |   ( Updated:2025-03-08 06:07:22.0  )
Ashwini Vaishnav: తెలంగాణలో మూడు బ్యాటరీ తయారీ క్లస్టర్లు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేసే మూడు క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnav) చెప్పారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి (Divitipalli) వద్ద అమర రాజా బ్యాటరీ కంపెనీ గిగా పరిశ్రమకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు అశ్వనీ వైష్ణవ్ రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తయారీరంగ యూనిట్స్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది ప్రధాని మోడీ (PM Modi) ఆలోచన అన్నారు. తెలంగాణలో 3 తయారీ రంగ క్లస్టర్స్ కి కేంద్రం సహకారం అందిస్తోందని అందులో ఒకటి దివిటిపల్లిలో ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీ కంపెనీ భూమి పూజకు ఇవాళ వెళ్తున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహకారం అందిస్తున్నాయన్నారు.

పెండింగ్ సమస్యలు పరిష్కరించండి:

అంతకు ముందు ఎయిర్ పోర్టులో దిగిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు కలిశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy), సీతక్క(Seethakka), కొండా సురేఖతో పాటు ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై (Railway Projects) ప్రభుత్వం తరపున వినతిపత్రం అందజేశారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో అరగంట చర్చించామని మంత్రి కొమటిరెడ్డి వివరించారు. మేము నివేదించిన అంశాలపై సానుకూలంగా స్పందించారని, వరంగల్ కు రింగ్ రోడ్డు ఇస్తామన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాజీపేట డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు, పెండింగ్ లో ఉన్న వికారాబాద్ రైల్వే లైన్ పై స్పష్టత, డోర్నకల్-భద్రాచలం రైల్వే లైన్ బ్రిడ్జి వంటి సమస్యలపై కేంద్ర మంత్రికి వివరించినట్లు కోమటిరెడ్డి చెప్పారు.



Next Story

Most Viewed