రాహుల్ అనర్హత వేటుపై షర్మిల రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 4 |
రాహుల్ అనర్హత వేటుపై షర్మిల రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశంపై శనివారం ఆమె స్పందించారు. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతునొక్కడం, కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు.

రాహుల్ గాంధీపై వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేగా అభివర్ణించారు. వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీకి 30రోజుల సమయం ఉన్నా.. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అన్నారు. ప్రతిపక్షాల అణచివేతను పార్టీలకు అతీతంగా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Next Story

Most Viewed