ఇదీ ఆరంభం మాత్రమే.. ఈనెల 20 నుంచి 22 వరకు నేషనల్ యూత్​బయోడైవర్సీ కాన్ఫరెన్స్​

by Yella Dhawani Reddy |

తెలంగాణ గర్వకారణంగా నిలిచేలా నేషనల్​యూత్​బయోడైవర్సీ కాన్ఫరెన్స్​నిర్వహిస్తున్నామని తెలంగాణ బయోడైవర్సీ బోర్డుసభ్యులు కాళీఛరణ్ ఖార్తాడే తెలిపారు.

ఇదీ ఆరంభం మాత్రమే.. ఈనెల 20 నుంచి 22 వరకు నేషనల్ యూత్​బయోడైవర్సీ కాన్ఫరెన్స్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గర్వకారణంగా నిలిచేలా నేషనల్​యూత్​బయోడైవర్సీ కాన్ఫరెన్స్​నిర్వహిస్తున్నామని తెలంగాణ బయోడైవర్సీ బోర్డుసభ్యులు కాళీఛరణ్ ఖార్తాడే తెలిపారు. అటవీ శాఖ అరణ్యభవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవ వైవిధ్య పరిరక్షణకు యువతకు సాధికారిత కల్పించేందుకు నేషనల్​యూత్​బయోడైవర్సీ కాన్ఫరెన్స్​నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో ఈ కాన్ఫరెన్స్​నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజులపాటు జరిగే జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై కీలక ప్రసంగాలు, ప్యానెల్, చర్చలు, వర్క్​షాప్​లు, ఆచరణత్మక టైనింగ్​ఉంటుందని తెలిపారు.

ముఖ్యంగా జీవ వైవిధ్య నీతి, పర్యావరణ ఉగ్రవాదం, డిజిటల్​సీక్వెన్స్​సమాచారం, స్వదేశీ సమాజాల పాత్రలపై వర్క్​షాపు నిర్వహించనున్నామని ఆయన అన్నారు. కార్యక్రమానికి ఫస్ట్​డే ఛీప్​గెస్ట్‌గా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, చివరి రోజు తెలంగాణ గవర్నర్​హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, జీవవైవిధ్య పరిరక్షణ, స్థిరమైన వనరుల నిర్వహణ, చట్టపరమైన, స్వదేశీ జ్ఞాన వ్యవస్థలను కవర్​చేసేలా విభిన్న ఎజెండాతో ముందుకెళ్తున్నామన్నారు. కున్మింగ్–మాంట్రియల్​గ్లోబల్​బయోడైవర్సీ ఫ్రేమ్​వర్క్స్​వంటి ప్రపంచ సమావేశాల కింద భారత్​నిబద్ధతలను బలోపేతానికి లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా జీవ వైవిధ్యంలో యువ నాయకులను బయటకు తీసుకురానుందన్నారు.

దేశంలోని ఉన్న రాష్ట్రాలతోపాటు యూటీలను ఇద్దరేసి పీజీ స్టూడెంట్స్ ఈ కాన్ఫరెన్స్‌లో భాగస్వాములు అవుతున్నారని కాళీఛరణ్ ఖార్తాడే చెప్పారు. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 650 మంది స్టూడెంట్స్​ నుంచి దరఖాస్తులు అందాయని, అందులోంచి షార్ట్​లీస్టు చేశామని, మొత్తంగా 70 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, పర్యావరణ నాయకుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నిపుణులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యార్థి ప్రతినిధులను ఒక చోట చేర్చి కీలకమైన పర్యావరణ సవాళ్లు, పరిష్కారాలను చర్చించే అవకాశముందన్నారు. అలాగే, తెలంగాణలోని ఆదిలాబాద్​జిల్లాలోని గిరిజను ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కాన్ఫరెన్స్‌కు నేషనల్ బయోడైవర్సీ ఆథరిటీ చైర్​పర్సన్​అచలేందర్​రెడ్డి, పంజాబ్​బయోడైవర్సీ సెక్రటరీ మెంబర్​నీలిమా, పద్మశ్రీ అవార్డు గ్రహీత రహిబాయిసోమ, డబ్ల్యూడబ్ల్యూ ఇండియా స్టేట్ డైరెక్టర్​ఫరిదా, రిటైర్డ్​ఐఎఫ్​ఎస్​ఎకె.గోయల్, ఎన్​బీఏ చైర్​పర్సన్​మాథూర్, డబ్ల్యూఏటీఓం యోగితా, యూత్​లీడర్స్​మీనాల్, హేమవతి, శంకర్‌లు విచ్చేస్తున్నారని తెలిపారు. అయితే, ఈ కాన్ఫరెన్స్​ద్వారా హైదరాబాద్​డిక్లనరేషన్​పేరిట ఒక డ్యాకుమెంటరీ తయారు చేయనున్నామన్నారు. ఇదీ ఆరంభం మాత్రమేనని, ప్రతి ఏటా నేషనల్​యూత్​బయోడైవర్సీ కాన్ఫరెన్స్ నిర్వహిణకు ఇదీ ఒక వేదిక కానుందని ఈ సందర్భంగా కాళీచరణ్​ఖర్తాడే వివరించారు.

Next Story