Kadiyam Srihari : పదేళ్లు తెలంగాణను దోచుకున్నారు : కడియం శ్రీహరి

by Y. Venkata Narasimha Reddy |

బీఆర్ఎస్(Brs) అవినీతి పాలనలో నేను భాగస్వామిని కావొద్దనే పార్టీమారానని, పదేళ్లు బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను దోచుకున్నారని మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)కీలక వ్యాఖ్యలు చేశారు.

Kadiyam Srihari : పదేళ్లు తెలంగాణను దోచుకున్నారు : కడియం శ్రీహరి
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(Brs) అవినీతి పాలనలో నేను భాగస్వామిని కావొద్దనే పార్టీమారానని, పదేళ్లు బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను దోచుకున్నారని మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే..జనగామ గడ్డపై ముక్కు నేలకు రాస్తానని కడియం శ్రీహరి సవాల్ చేశారు. తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేలఎకరాలు దోచుకున్నారని, ఫామ్‌హౌస్‌లు, ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని కడియం ఆరోపించారు.

కేటీఆర్ కు జైలుకు వెళ్తాడనే భయం పట్టుకుందన్నారు. బీఆర్ ఎస్ పాలకుల తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, త్వరలోనే వారి చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని కడియం వ్యాఖ్యానించారు.

Next Story