పశువుల్లా లారీల్లో తరలిస్తున్నరు! సభపై విశారదన్ సంచలన ట్వీట్

by Disha Web Desk 14 |
పశువుల్లా లారీల్లో తరలిస్తున్నరు! సభపై విశారదన్ సంచలన ట్వీట్
X

దిశ,డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికల సమరశంఖం పూరించింది. ఈ భారీ బహిరంగ సభకు జన జాతర అని పేరు పెట్టారు. సభకు పార్టీ జెండాలతో భారీగా ప్రజలు తరలివస్తున్నారు. అయితే ఈ సభపై డీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ విశారదన్ మహారాజ్ సంచలన ట్వీట్ చేశారు.

‘తుక్కుగూడలో 10 లక్షల మంది హాజరయ్యే కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌కి.. 9 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలని పశువుల్లాగా.. ఎర్రటి ఎండలో లారీల్లో తరలిస్తూ ఉండడం. రెడ్ల అధికార అగ్రకుల అహంకారానికి నిదర్శనం. తొమ్మిది లక్షల మంది "రెడ్లే " ఈ సభకు హాజరు కావాలి. ఒక లక్ష మంది మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో 90% అధికారాన్ని రెడ్లు మాత్రమే అనుభవిస్తున్నారు.10 శాతం అధికారాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనుభవిస్తున్నారు కాబట్టి’ అని ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed