అలర్ట్: రేపటినుంచి మూడ్రోజుల పాటు వర్షాలు పడేది ఈ జిల్లాల్లోనే!

by Disha Web Desk 2 |
అలర్ట్: రేపటినుంచి మూడ్రోజుల పాటు వర్షాలు పడేది ఈ జిల్లాల్లోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎండలు దంచికొడుతున్న తరుణంలో రాష్ట్ర వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణం పూర్తిగా మారనుందని తెలిపింది. రేపటి(మార్చి 15) నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి సోమవారం బలపడడంతో.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ బాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు రావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.


Next Story

Most Viewed