పోచమ్మ దేవాలయంలో చోరీ

by Disha Web Desk 4 |
పోచమ్మ దేవాలయంలో చోరీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్‌లో గల పోచమ్మ దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని గల్లా పగల గొట్టి దుండగులు డబ్బులు దొంగలించారు. సంవత్సర కాలంగా తెరవని గల్లాను గుల్ల చేశారు. గతేడాది గల్లా ద్వారా రూ.లక్షా 50వేలు ఆదాయం వచ్చిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అంతే మొత్తంలో గల్లాలో ఉండవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story