పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా భగ్నం.. 9 బస్తాలు స్వాధీనం

by Kodari Anjali |

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ట్రాలీ ఆటోను సివిల్ సప్లై అధికారి పట్టుకున్నారు

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా భగ్నం.. 9 బస్తాలు స్వాధీనం
X

దిశ, ధర్మారం: ధర్మారం మండలంలోని కొత్తూరు గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ట్రాలీ ఆటోను సివిల్ సప్లై అధికారి మిర్యాల వెంకటరాజు పట్టుకున్నారు. సోమవారం వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ప్రభుత్వం సరఫరా చేసిన 9 బస్తాల పీడీఎస్ బియ్యం (సుమారు 3 క్వింటాళ్లు) ఉన్నట్లు గుర్తించారు. వాహనం నడుపుతున్న వ్యక్తిని విచారించగా, అతను రాజారాంపల్లి గ్రామానికి చెందిన చింతల రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై సివిల్ సప్లై అధికారి మిర్యాల వెంకటరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతల రాజుపై కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్‌ఐ ఎం. ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Next Story