రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ల రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 2 |
రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ల రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. వారం రోజుల క్రితం విశాఖపట్నంలో షూటింగ్‌‌లో పాల్గొన్న ఆయన హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా.. ఆయన మృతిపై గాంధీ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ‘ఇవాళ ఉదయం రక్త విరోచనాలు కావడంతో మాస్టర్ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డయాబెటిక్ పేషెంట్ కావడం, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి తుదిశ్వాస విడిచారు’ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

రాకేశ్ మాస్టర్ మృతికి అదే కారణమా.. అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్!



Next Story