హైకోర్టులో BJP ఎంపీ అరవింద్‌కు చుక్కెదురు

by Disha Web Desk 19 |
హైకోర్టులో BJP ఎంపీ అరవింద్‌కు చుక్కెదురు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఆయన విచారణను ఎదుర్కోవాల్సిందే అంటూ హైకోర్టు ఛీఫ్ ​జస్టిస్​ ఉజ్జల్ ​భుయాన్​ పేర్కొన్నారు. ఈ కేసుపై ఉన్న స్టేను కూడా హైకోర్టు వెకేట్​ చేసింది. 2‌‌021, అక్టోబర్​31న ఎంపీ ధర్మపురి అరవింద్ ​చెంచల్ ​గూడ జైల్లో ఉన్న నవీన్​కుమార్​ అలియాస్​తీన్మార్​ మల్లన్నను చెంచల్​గూడ జైలుకు వచ్చి కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది పనికిమాలిన లొట్టపీసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.

దీనిపై ఓ సోషల్​ వర్కర్ ​మాదన్నపేట పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మాదన్నపేట పోలీస్ ​స్టేషన్‌తో పాటు నిజామాబాద్​ పోలీస్​ స్టేషన్‌లో కూడా ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్‌లను స్క్వాష్చే యాలని, దాంతో పాటు ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే ఇవ్వాలని కోరుతూ గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ​కోర్టులో పిటీషన్ ​దాఖలు చేశారు. దాంతో న్యాయస్థానం స్టే మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేసుపై ఉన్న స్టేను వెకేట్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఎంపీ ధర్మపురి అరవింద్​విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed