ముంబై నుంచి దుబాయ్‌కు సాహిల్‌.. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్!

by Disha Web Desk 2 |
ముంబై నుంచి దుబాయ్‌కు సాహిల్‌.. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వద్ద అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్.. ప్రమాదం తర్వాత ముంబై నుంచి దుబాయ్ వెళ్లాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు లొంగిపొమ్మని సాహిల్‌తో పాటు తండ్రి షకీల్ డ్రైవర్‌‌పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు సాహిల్‌కు బదులు డ్రైవర్ వచ్చారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసేందుకు నిరాకరించిన పోలీసులు సాహిల్‌ను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోజునే సాహిల్‌పై పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Next Story