పెద్ద ఇష్యూగా చూపి రెచ్చగొట్టాలనేదే ప్లాన్.. రేవంత్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్!

by Disha Web Desk 4 |
పెద్ద ఇష్యూగా చూపి రెచ్చగొట్టాలనేదే ప్లాన్.. రేవంత్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పక్క రాష్ట్రం రాజకీయాలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రాజకీయాలపై లేకపోవడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశం అని అక్కడి రాజకీయాలపై ఇక్కడ ఆందోళనలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని మాత్రమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని దీన్ని రేవంత్ రెడ్డి పెద్ద ఇష్యూగా చేసి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం శోఛనీయం అన్నారు. గురువారం మీడియా ఎజెన్సీతో మాట్లాడిన కవిత.. చంద్రబాబు అరెస్ట్ అంశం టీడీపీ, వైసీపీలకు సంబంధించిన విషయమని అందువల్ల దానిపై కామెంట్ చేయదల్చుకోలేదని చెప్పారు. అక్టోబర్ 1న రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులను తీసుకురావాలని కోరారు.

ఆ కూటమి ఉంటుందన్న గ్యారెంటీ లేదు..

విపక్ష ఇండియా కూటమి రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదని కవిత విమర్శించారు. ఆ కూటమిలో లక్షల్లో అభ్యర్థులు ఉన్నారని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సమస్యలతో పరిస్థితే వేరుగా ఉంటుదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి మారుతుందని.. ఎన్నికలకు ముందు కూటములు పెద్దగా విజయవంతమైన దాఖలాలు లేవని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ వేచిచూసే ధోరణితో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో ఒక అజెండా, తెలంగాణలో మరొక అజెండాతో ముందుకు వస్తోందని కానీ బీఆర్ఎస్‌ మాత్రం ఒక్కటే అజెండాతో పని చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన స్కీమ్‌లు అమలు సాధ్యం కావన్నారు. బీజేపీ గడిచిన పదేళ్లలో తెలంగాణకు చేసిందేమి లేదని రాబోయే ఎన్నికల్లో కర్నాటక ప్రజలు ఓడించినట్లే ఇక్కడ కూడా ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలే వస్తాయన్నారు.


Next Story