కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం

by Disha Web Desk 2 |
కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్​కల్పించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాజీవ్​గాంధీ యాక్సిడెంట్​స్కీమ్‌ను ఇంప్లిమెంట్ చేయాలని లీడర్ల నుంచి ఏఐసీసీకి ప్రపోజల్​వెళ్లింది. ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో నేషనల్ ఇండియా అష్యూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీతో కాంగ్రెస్​పార్టీ ముఖ్య నేతలు రివ్యూ నిర్వహించారు. అయితే ప్రజలకూ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పిస్తే మేలు జరుగుతుందని పార్టీలోని కొంతమంది నేతలు తీర్మానించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాజీవ్ గాంధీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఏప్రిల్ 1న 2022 ప్రారంభించారు. దీన్ని ఇప్పుడు విస్తృతం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​లీడర్లు చామలకిరణ్ కుమార్ రెడ్డి, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ పవన్ మల్లాది, ఇన్సూరెన్స్ కోఆర్డినేటర్స్ మధుసూదన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed