ఎంపీ ఎన్నికల సందడి మొదలు.. ప్రచారం ప్రారంభించిన కీలక నేతలు?

by Disha Web Desk 2 |
ఎంపీ ఎన్నికల సందడి మొదలు.. ప్రచారం ప్రారంభించిన కీలక నేతలు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారం మొదలు పెట్టి విస్తృతంగా జనాల్లో తిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ అదే ఊపును లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే హామీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కీలక నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్‌లు అంతా ఎంపీగా మరోసారి గెలిచేందుకు కసరత్తులు ప్రారంభించారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తారో తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed