- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుది దశకు చేరిన ‘కాళేశ్వరం’ విచారణ.. నేటి నుంచి అగ్రనేతల ఎంక్వైరీ షురూ
కాళేశ్వరం కమిషన్ తుది విచారణలో భాగంగా మాజీ ఆర్థిక మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ తుది విచారణలో భాగంగా మాజీ ఆర్థిక మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. అదే విధంగా ఈనెల 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, 11న మాజీ సీఎం కేసీఆర్.. విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సమయంలో ఈ ముగ్గురు కీలక బాధ్యతల్లో ఉన్నారు. దీంతో వారిని విచారించాలని కమిషన్నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా అధికారులను కమిషన్ విచారించింది. వారు చెప్పిన అంశాలు, వాటికి సంబంధించిన ఆధారాల ఆధారంగా ఈ ముగ్గురిని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
విచారణ సందర్భంగా మొదటి గంట పాటు వారు ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ప్రశ్నలు అడగనున్నారు. వారిని ప్రశ్నలు అడిగే సమయంలో స్పష్టమైన ఆధారాలను వెంటబెట్టుకుని అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురిని క్రాస్ఎగ్జామినేషన్కాకుండా విచారణ మాత్రమే చేయనున్నారు. ఈ ముగ్గురి విచారణ లేకుండానే నివేదిక ఇవ్వాలని మొదట కమిషన్భావించినా.. ఆ తర్వాత గతంలోని విచారణ కమిషన్ నివేదికలను పరిశీలిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకొని నివేదిక ఇచ్చినట్లుగా గుర్తించారు. అదే సమయంలో సహజ న్యాయ సూత్రంలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరణ లేకుండా కమిషన్నివేదిక ఇస్తే ఏకపక్షం అవుతుందని, తద్వారా విమర్శలు తలెత్తే అవకాశం ఉందని కమిషన్ ఆలోచించి.. ఈ ముగ్గురికి నోటీసులు అందించినట్లు తెలిసింది. కేసీఆర్కు మొదట జూన్-5న హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, తనకు ఆరోగ్యం బాలేనందున ఆ రోజు హాజరుకాలేనని కమిషన్కు సమాచారం అందించారు. దీంతో ఆయనకు ఈనెల 11న హాజరయ్యే విధంగా అవకాశం కల్పించారు. వీరి విచారణ కోసం ప్రభుత్వం 2 నెలల గడువు కూడా పొడిగించింది.






