భార్య ఆత్మహత్య చేసుకున్న స్థలంలోనే పెళ్లి రోజు భర్త సూసైడ్

by Disha Web Desk 4 |
భార్య ఆత్మహత్య చేసుకున్న స్థలంలోనే పెళ్లి రోజు భర్త సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య ఆత్మహత్య చేసుకున్న చోటే భర్త సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. హుస్నాబాద్ గోదాంగడ్డ వద్ద వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి శ్యాంసుందర్ సూసైడ్ చేసుకున్నాడు. భార్య లేదనే మనస్తాపంతో పెళ్లిరోజే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే భార్య ఉరి వేసుకున్న స్థలంలోనే భర్త సూసైడ్ చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Next Story

Most Viewed