చంద్రబాబు అరెస్ట్ వేళ మోహన్ బాబు కామెంట్స్ వీడియో వైరల్.. బాబు నన్ను అలా మోసం చేశాడంటూ..

by Disha Web Desk |
చంద్రబాబు అరెస్ట్ వేళ మోహన్ బాబు కామెంట్స్ వీడియో వైరల్.. బాబు నన్ను అలా మోసం చేశాడంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : హెరిటేజ్ సంస్థ ఎవరిది అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు టక్కున చెప్పే ఆన్సర్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి అని.. కానీ హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదు నాదేనని టాలీవుడు సీనియర్ హీరో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ లో అత్యధిక వాటా పెట్టింది నేనేనని.. చంద్రబాబు ఆ సంస్థను లాక్కున్నాడని ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన ఈ సమయంలో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘‘రాజకీయంగా, మానసికంగా చంద్రబాబు నన్ను దెబ్బతీశాడు. హెరిటేజ్ ఫ్రూట్స్ సంస్థ నాది. దానిని ఎక్కువ పెట్టుబడి పెట్టింది నేను. నా షేర్ ఎక్కువ. కానీ చంద్రబాబు నాయుడు దానిని లాక్కున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు వెళ్లేటప్పుడు మా ఇంటికి వచ్చాడు.. ఆ సమయంలో బ్రెక్ ఫాస్ట్ చేస్తూ.. ‘ఎమయా.. నువ్వు చంద్రబాబు ఫ్రెండ్సే కదా.. మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటీ అని అడిగారు.. అప్పుడు నేను హెరిటేజ్ గురించి చెప్పాను.. దానికి ఆయన చంద్రబాబు ఆయన మామనే వెన్నుపోటు పొడిచాడు.. ఆఫ్ట్రాల్ నిన్ను మోసం చేయడంలో కొత్తేముంది అన్నాడు’’ అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed