- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సంక్షేమమే లక్ష్యం.. బీఆర్ఎస్ ఆరోపణలు రాజకీయ నాటకమే : కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా రూపొందించిందని, విపక్ష సభ్యులు మాత్రం రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా రూపొందించిందని, విపక్ష సభ్యులు మాత్రం రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం శాసనమండలిలో బడ్జెట్ సభ్యులు బల్మూరి వెంకట్, బొగ్గరపు దయానంద్, శంకర్ నాయక్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో శంకుస్థాపన చేయడం తప్ప ప్రాజెక్టుల పనులు చేపట్టలేదని, గుత్తేదార్ల నుంచి కమీషన్లు మొత్తంలో తీసుకున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పాటు పడుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తూ ప్రజల కోసం కోట్లాడుతున్నామని ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వారి పాలన జరిగిన అభివృద్ధి, దోపిడీ చూస్తే ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోయాయని అన్నారు.
బడ్జెట్లో విద్య, వైద్య, సంక్షేమ రంగానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగాయని, రైతులకు పెట్టుబడి సాయం, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు చేస్తే మద్దతు కల్పించామని, సన్నాలు పండించిన రైతులకు బోనస్ ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇవ్వలేదన్నారు. యూరియా యాప్తో రైతులు రోజు తరబడి బస్తాల కోసం క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా పోయిందని, ప్రతి రైతులకు యూరియా సరఫరా జరిగి, బ్లాక్మార్కెట్ అమ్మకాలు జరగకుండా నియంత్ర చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు, నెలకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేసి పేదల గుండెల్లో నిలిచామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ఎమ్మెల్యేలు భూకబ్జాలు, ప్రాజెక్టులో కమీషన్లు తీసుకొని కోట్లకు పడగలెత్తారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.






