- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండలి బడ్జెట్ ప్రసంగమంతా ఇంగ్లీషులోనే..
మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ప్రసంగమంతా ఇంగ్లీషులోనే జరిగింది.

- అధికార పార్టీ సభ్యులకే అర్ధం కానీ పరిస్థితి
- బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు మధ్యలో అభ్యంతరాలు
- గంటన్నర పాటు ప్రసంగించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బడ్జెట్అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టగా, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రవేశ పెట్టారు. 2026–27 ఏడాదికి రూ.3,24,234 కోట్ల అంచనా వేసి, ప్రభుత్వం నూతన పథకాలు ప్రతిపాదించింది. బడుగుల బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్గతం కంటే ఎక్కువగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం మండలిలో జరిగిన ఉత్తమ్కుమార్ప్రసంగమంతా ఇంగ్లీషునే సాగించింది. అదికార కాంగ్రెస్పార్టీ సభ్యులకు అర్ధం కాక సభ నుంచి బయటకు వచ్చారు. ఆరు గ్యారంటీల అమలు అంశం ప్రస్తావన సమయంలో విపక్ష పార్టీ సభ్యలు అవాస్తవాలు చెబుతున్నారని అభ్యంతరం చెప్పారు. అమలు చేయని పథకాలు చేసినట్లు చెప్పడం సిగ్గుచేటన్నారు. గత ఏడాది బడ్జెట్కంటే తక్కువ కేటాయింపులు చేసినట్లు బీఆర్ఎస్, బీజీపీ సభ్యులు ఆరోపించారు. అంకెలా గారడీ, అసత్యాలతో ఉందన్నారు. విపక్ష సభ్యులు అభ్యంతర చెప్పిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తన ప్రసంగం ఆగకుండా చదివారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వం విమర్శలు చేయడం మానుకోవాలని హితువు పలికారు.






