- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే.. ఎస్ఈసీ రాణి కుముదిని కీలక ప్రకటన
రాష్ట్రంలో రేపు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో రేపు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini) కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుందని అన్నారు. పోలింగ్ పూర్తి అవ్వగానే కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే ఉంటుందని స్పష్టం చేశారు. 3,834 గ్రామాలు, 27,628 వార్డుల్లో పోలింగ్ జరగనుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, తొలి విడతలో భాగంగా 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవం ఎన్నిక జరిగిందని రాణి కుముదిని తెలిపారు.






