అప్పుడే షురూ అయింది.. మేడారానికి పోటెత్తిన భక్తజనం

by Ramesh Naini |   (  Updated:2026-01-11 10:30:59  IST  )

ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మేడారానికి తరలివస్తున్నారు.

అప్పుడే షురూ అయింది.. మేడారానికి పోటెత్తిన భక్తజనం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. దీంతో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడుతోంది. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో పస్ర-మేడారం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

నార్లపూర్, కొత్తూరు, జంపన్నవాగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పటిష్టం చేశారు. ఈ రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్న విషయం తెలిసిందే.

READ MORE .....

మేడారం జంపన్న వాగు వద్ద పాప మిస్సింగ్.. సురక్షితంగా చేరదీసిన మంత్రి సీతక్క

Next Story