Uttham kumar: స్థిరాస్తి వ్యాపారులకు అండగా ఉంటాం.. క్రెడాయ్ సదస్సులో మంత్రి ఉత్తమ్

by Prasad Jukanti |

క్రెడాయ్ సదస్సులో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Uttham kumar: స్థిరాస్తి వ్యాపారులకు అండగా ఉంటాం.. క్రెడాయ్ సదస్సులో మంత్రి ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థిరాస్తి వ్యాపారులకు అండగా ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రెడాయ్ సదస్సులో మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఇప్పటికే 40 శాతం పైగా పట్టణీకరణ జరుగుతున్నదని, ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతుందనడంలో సందేహం లేదన్నారు. హైదరాబాద్ కు కృష్ణ, గోదావరి జలాలను తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, యువతకు ఉపాధి కోసం రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.

Next Story