అందుకే మీ పవర్ కట్ చేశారంటూ.. అసెంబ్లీ‌లో కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

by Disha Web Desk 4 |
అందుకే మీ పవర్ కట్ చేశారంటూ.. అసెంబ్లీ‌లో కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు కావాల్సినంత పవర్ ఇచ్చినందుకే ప్రజలు మాకు పవర్ ఇచ్చారని మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మేం నిరంతరం పవర్ ఇస్తాం, ప్రజలు కూడా ఎప్పటికీ మాకే పవర్ ఇస్తారన్నారు. పవర్ హాలీడే ఇచ్చారు కాబట్టే కాంగ్రెస్ పవర్ కు ప్రజలు హాలీడే ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సరిపడా నీళ్లు, నిదులు ఇస్తోందని రైతులు సంబరపడుతున్నారన్నారు. విపక్షాలకు ఇక ఎప్పటికీ పవర్ రాదని బాధ కలుగుతోందన్నారు.

ఈటల నిండుపున్నమిలో వెన్నెల వెలుగులు చూడకుండా చందమామలో మచ్చలు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బడుగు, బలహీన వర్గాలకు ఏమీ చేయొద్దన్నట్లుగా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో బడ్జెట్ సమావేశాలప్పుడు నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారన్నారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ తరచూ నిరసన ప్రదర్శన జరిగేదన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ నీటి వల్ల ఎముకలు వంకర్లు పోయి బాధపడేవారన్నా్రు. ప్రజల గుండెల మీద ఫ్లోరైడ్ బండలు తొలగించిందెవరని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమునాను నిలిపామన్నారు.


Next Story