- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకే సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా: కేఏ పాల్
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. తాము చేసిన న్యాయపోరాటం వల్లే కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని సీఎం కేసీఆర్ వాయిదా వేశారని అన్నారు. ముఖ్యమంత్రి తన తప్పును అంగీకరించకుండా ఎన్నికల కోడ్ తీసుకువచ్చి సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారని విమర్శించారు. సచివాలయం ఓపెనింగ్ విషయంలో తాము హైకోర్టులో న్యాయపోరాటం చేశామని తమ వల్లే కేసీఆర్ వెనక్కి తగ్గారని చెప్పారు. సెక్రటేరియట్లో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
Next Story






