‘టైమ్, డేట్, ప్లేస్ చెప్పు’.. కడియం శ్రీహరి సవాల్‌ను స్వీకరించిన రాజయ్య

by Gantepaka Srikanth |

కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ప్రకటించారు.

‘టైమ్, డేట్, ప్లేస్ చెప్పు’.. కడియం శ్రీహరి సవాల్‌ను స్వీకరించిన రాజయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ప్రకటించారు. బుధవారం రాజయ్య మీడియాతో మాట్లాడారు. టైమ్, డేట్, ప్లేస్ ఎక్కడో కడియం శ్రీహరే చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పిన సమయానికి అక్కడికి వస్తామని ప్రతి సవాల్ విసిరారు. కడియం శ్రీహరిపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కడియం తాను రావడమే కాకుండా రెవెన్యూ, ఫారెస్ట్ సిబ్బందిని వెంట తీసుకురావాలని అన్నారు. ఫిక్స్ చేసిన ప్లేస్‌లో మీ కంటే ముందే ఉంటామని వెల్లడించారు. తాము చేసిన ఆరోపించిన నిరూపించిన జీవితకాలం పాటు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ(Station Ghanpur Constituency) ప్రజలకు గులాంగిరి చేయాలని కండిషన్ పెట్టారు.

కాగా, స్టేషన్‍ ఘన్‍పూర్‍ నియోజకవర్గంలోని దేవునూర్‍ గుట్ట చుట్టూ ఉన్న గ్రామాల్లో తమ కుటుంబం ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపించినా.. తాను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‍రెడ్డి(Palla Rajeshwar Reddy), మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇండ్లలో గులాంగిరీ చేస్తానని, నిరూపించలేకపోతే ఆ ఇద్దరూ నాకు గులాంగిరి చేయాలని కడియం శ్రీహరి నిన్న సవాల్ చేశారు. చీము, నెత్తురు ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కడియం వ్యాఖ్యలపై ఇవాళ మీడియా ముందుకు వచ్చిన రాజయ్య.. చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

Next Story