రేవంత్ రెడ్డి పాదయాత్రలో థాక్రే

by Dishanational2 |
రేవంత్ రెడ్డి పాదయాత్రలో థాక్రే
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి పాదయాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఇంచార్జ్​ మానిక్​ రావు థాక్రే ములుగు వెళ్లనున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి పస్రా కు వెళ్లినట్లు గాంధీభవన్​ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆయనతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీకూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మేడారం నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతున్నది. వనదేవతలు సమ్మక్క, సారాలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి దేవతల ఆశీర్వాదాలు తీసుకొని రేవంత్​ పాదయాత్ర ను మొదలు పెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రేవంత్​ పాదయాత్రలో ములుగు నియోజక వర్గం ఎమ్మెల్యే సీతక్క ,ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మల్లు రవి తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed